Search for:
  • Home/
  • Breaking/
  • జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

దుబాయ్‌: భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌..ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 712 పరుగులు చేయడం ద్వారా భారత విజయంలో జైస్వాల్‌ కీలకంగా వ్యవహరించాడు. సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన జైస్వాల్‌ మూడు అర్ధసెంచరీలు సాధించాడు.

ఈ క్రమంలో పలు రికార్డులు కొల్లగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సరసన జైస్వాల్‌ నిలిచాడు. తనకు అవార్డు రావడంపై జైస్వాల్‌ స్పందిస్తూ ‘ఐసీసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తానన్న నమ్మకం నాకుంది. నా కెరీర్‌లో మరిచిపోలేని సిరీస్‌ ఇది. సహచరులతో కలిసి సిరీస్‌ విజయంలో భాగం కావడం గర్వంగా ఉంది’ అని అన్నాడు.