Search for:

ఓటమి బాటలోనే

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి బాటలోనే సాగుతోంది. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. బుధవారం 29-54 తేడాతో తమిళ్‌ తలైవాస్‌ చేతితో చిత్తయింది. ఎప్పటిలాగే కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ (10) ఒంటరి పోరాటం చేశాడు. అతను కాకుండా అజిత్‌ పవార్‌ (7), హమిద్‌ (6) మాత్రమే ఫర్వాలేదనిపించారు. తలైవాస్‌ జట్టులో అజింక్య (11), సాగర్‌ (8), నరేందర్‌ (9) సత్తాచాటారు. హైదరాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ ఒకటి గెలిచి, మూడు ఓడింది. తర్వాతి అంచె పోటీలు శుక్రవారం నుంచి పట్నాలో జరుగుతాయి. అంతకుముందు తొలి మ్యాచ్‌లో దబంగ్‌ దిల్లీ 35-32తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. సినీ నటి లావణ్య త్రిపాఠి ఈ మ్యాచ్‌ల్లో సందడి చేశారు. వ్యాఖ్యాతగానూ అలరించారు.