Search for:
  • Home/
  • Breaking/
  • భారత అమ్మాయిల శుభారంభం

భారత అమ్మాయిల శుభారంభం

మస్కట్‌: హాకీ ఫైవ్స్‌ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం పూల్‌-సి తొలి మ్యాచ్‌లో 5-4 గోల్స్‌తో పోలెండ్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా సాగింది. తొలి పది నిమిషాల్లోనే భారత్‌-పోలెండ్‌ ఖాతాలో రెండేసి గోల్స్‌ చేరాయి. భారత్‌ తరఫున ముంతాజ్‌ (4వ), దీపిక (6వ).. పోలెండ్‌ జట్టులో జూలియా (8వ), మార్లీనా (10వ) సఫలమయ్యారు. 23వ నిమిషంలో ముంతాజ్‌, మరియానా గోల్స్‌ సాధించడంతో భారత్‌ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పోలెండ్‌ కూడా గట్టిగానే ప్రతిఘటించింది. పౌలా (27వ), పోల్‌జాక్‌ (29వ) గోల్స్‌తో 4-4తో స్కోరు సమం చేసింది. అయితే 29వ నిమిషంలోనే దీపిక గోల్‌ చేసి భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. హాకీ ఫైవ్స్‌ మ్యాచ్‌ 30 నిమిషాలే జరుగుతుంది. రెండో మ్యాచ్‌లో భారత్‌ 7-3తో అమెరికాను ఓడించింది.