రారాజు గుకేశ్..
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024 టైటిల్ కైవసం టొరంటో : భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సంచలన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024’ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ విజేతను నిర్ణయించే 14వ రౌండ్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్ను డ్రా చేసుకున్న అతడు 9 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి చేరి 17 ఏండ్ల వయసులోనే ఈ టోర్నీ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. [...]