Search for:
  • Home/
  • Breaking/
  • భారత బృందానికి స్వర్ణం

భారత బృందానికి స్వర్ణం

ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్

దిల్లీ: ఆసియా ఆక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బృందం స్వర్ణం సొంతం చేసుకుంది. 4×200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే విభాగంలో ఆర్యన్‌ నెహ్రా, అనీశ్‌ గౌడ, సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరిల బృందం 7 నిమిషాల 26.64 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్‌లో నమోదైన భారత స్విమ్మర్ల అత్యుత్తమ టైమింగ్‌ (7:29.04)ను మెరుగుపరిచింది. వియత్నాం (7:29.43) జట్టుకు రజతం, థాయ్‌లాండ్‌ (7:40.37) బృందానికి కాంస్యం లభించాయి. మహిళల 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో పాలక్‌ జోషి స్వర్ణం నెగ్గింది.