ఓటమి బాటలోనే
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటమి బాటలోనే సాగుతోంది. సొంతగడ్డపై చివరి మ్యాచ్లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. బుధవారం 29-54 తేడాతో తమిళ్ తలైవాస్ చేతితో చిత్తయింది. ఎప్పటిలాగే కెప్టెన్ పవన్ సెహ్రావత్ (10) ఒంటరి పోరాటం చేశాడు. అతను కాకుండా అజిత్ పవార్ (7), హమిద్ (6) మాత్రమే ఫర్వాలేదనిపించారు. తలైవాస్ జట్టులో అజింక్య (11), సాగర్ (8), నరేందర్ (9) [...]