Search for:
  • Home/
  • Uncategorized/
  • జాతీయ ఆర్చరీ ఉపాధ్యక్షులుగా సత్యం, సంజీవ

జాతీయ ఆర్చరీ ఉపాధ్యక్షులుగా సత్యం, సంజీవ

జాతీయ ఆర్చరీ సంఘం ఎన్నికల్లో ఇద్దరు తెలుగు వ్యక్తులకు చోటు లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి ఉపాధ్యక్షులుగా గెలిచారు. ఇక, జాతీయ సంఘం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ప్రధాన కార్యదర్శిగా వీరేంద్ర సచ్‌దేవ్‌ ఎన్నికయ్యారు.