కోర్టుకెక్కిన రెజ్లర్ బజ్రంగ్
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మార్చి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్ ఆపాలంటూ స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా కోర్టుకెక్కాడు. ఈ సెలక్షన్స్లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించిన అతను.. ట్రయల్స్ ఆపాలంటూ దిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశాడు. బజ్రంగ్తో పాటు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సత్యవర్త్ కడియన్ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు సమాచారం. వీళ్లంతా గత ఏడాది అప్పటి [...]